1. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. రోజంతా జరిగే ఈ సమావేశంలో ఐదు రాజకీయ తీర్మానాలను ఆమోదించనున్నారు.

  2. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు విచారించనుంది.

  3. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలోని ప్లాంట్ సైన్సెస్ ప్రొఫెసర్ విద్యావర్ధిని యూనివర్సిటీలో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం సస్పెండ్ చేసింది.